Saturday, May 18, 2024

AP : వరదాపురం సూరి వర్సెస్ పరిటాల శ్రీరామ్

శ్రీ సత్యసాయి బ్యూరో, మార్చి 4( ప్రభన్యూస్): శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం వరదాపురం సూరికి చెందిన వాహనాలను పరిటాల శ్రీరామ్ వర్గం ధ్వంసం చేసిన సంఘటన సోమవారం బత్తలపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంఘటనలో వరదాపురం సూరి కి చెందిన 15 నుంచి 20 వాహనాలు ద్వంస‌మ‌య్యాయి. దీంతో కొద్దిసేపు మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రా కదిలిరా సభ లో భాగంగా సోమవారం హిందూపురం లోకసభ పరిధిలో ని పెనుకొండ నియోజకవర్గ సమీపంలో గల కియా ఫ్యాక్టరీ వద్ద సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సభకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు ,పార్టీ అభ్యర్థులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) సైతం ధర్మవరం నియోజకవర్గం నుంచి సుమారు 200 వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

టిడిపి అధ్యక్షుని సభకు బిజెపికి చెందిన నీవు వాహనాలు ఎందుకు పెట్టావు అంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు బత్తలపల్లి మండల కేంద్రంలో కాపు కాచి, మరి 15 నుంచి 20 వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఇందుకు నిరసనగా వరదాపురం సూరి వర్గీయులు బత్తలపల్లి మండల కేంద్రంలోని నాలుగు రోడ్లు కూడలి లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, పరిటాల శ్రీరామ్ వర్గీయులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను విడగొట్టి సర్ది చెప్పారు. దీంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement