Tuesday, May 7, 2024

KNL: కౌలు రైతు ఆత్మహత్య

కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని గురుజాల గ్రామానికి చెందిన కురువ బీరప్ప అనే కౌలు రైతు శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఉన్న పొలంతో పాటు పది ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. వర్షాలు లేక తుంగభద్ర నదీ ఎండిపోవడంతో పంట నష్టం జరిగింది.

దీంతో చేసిన అప్పులు తీర్చలేనని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం రాత్రి కురవ బీరప్ప మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, రైతులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement