Saturday, May 4, 2024

ఉక్రెయిన్ నుంచి ఏపీకి చేరుకుంటున్న తెలుగు విద్యార్థులు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు తెలుగు విద్యార్థులు దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు చేరుకున్నారు .ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (పీఆర్సీ) ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు.

ఉక్రెయిన్‌ నుంచి ఢిల్లీ చేరుకున్న విద్యార్థులను ఏపీ భవన్‌ సిబ్బంది విమానాశ్రయంలో ఆహ్వానించారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత భోజనం, వసతి, రవాణా సదుపాయం ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (పీఆర్సీ) ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో మొత్తం 1100 మంది తెలుగు విద్యార్థులున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement