Monday, May 6, 2024

India Corona: దేశంలో 10 వేల కరోనా కేసులు..255 మరణాలు

దేశంలో కరోనా కేసులు శాంతించాయి. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 10273 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,16,117 కు చేరింది. ఇక దేశంలో తాజాగా 255 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,13,724 కి పెరిగింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20439 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యా ప్తంగా రికవరీల సంఖ్య 4,22,90,921 కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,77,44,08,129 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement