Tuesday, April 30, 2024

ఇకపై తిరుపతి కేంద్రంగా తెలుగు అకాడమీ: లక్ష్మిపార్వతి

తిరుమల, ప్రభన్యూస్‌ : ఇకపై తిరుపతి కేంద్రంగా తెలుగు భాషా అకాడమీ పనిచేస్తుందని, ఏపిలో వివిధ విభాగాలకు రావలసి న నిధుల బకాయిలను అన్నింటిని కూడా రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తుందని భావిస్తున్నానని తెలుగు భాషా అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌ లక్ష్మీపార్వతి అన్నారు. శుక్రవారం ఉదయం ఆమె విఐపి విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడుతూ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో నిన్న తెలంగాణ ప్రభుత్వం అకాడమికి 95 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement