Saturday, May 4, 2024

విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల పెంపుపై తిరుప‌తిలో టీడీపీ వినూత్న నిర‌స‌న‌..

తిరుపతి , (ప్ర‌భ న్యూస్‌) : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రజలపై అనేక ర‌కాలు ప‌న్నులు వేస్తూ విప‌రీతంగా దోచుకుంటున్నార‌ని టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి సుగుణ‌మ్మ అన్నారు. కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్ర‌జ‌ల‌ను కోలుకోలేకుండా బాదుతున్నార‌న్నారు. ఆదివారం సాయంత్రం 15వ డివిజన్ బైరాగి పట్టడిలో రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు. ప్రజలకు కరెంటు బల్బులు, విసనకర్రలు, కొవ్వొత్తులు ఇస్తూ నిర‌స‌న తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement