Tuesday, April 30, 2024

TDP Protest ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ నిర‌స‌న కార్య‌క్రమంలో లోకేష్, బ్ర‌హ్మ‌ణి..

రాజ‌మహేంద్ర‌వ‌రం – టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. గతంలో చేపట్టిన ‘మోత మోగిద్దాం’, ‘కాంతితో క్రాంతి’, ‘న్యాయానికి సంకెళ్లు’ తరహాలోనే తాజాగా ‘మనం చేద్దాం జగనాసుర దహనం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది. ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పిలుపుమేరకు వైకాపా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ‘ సైకో జగన్‌ పోవాలి’ అని రాసిన పత్రాలను ప్రజలు, పార్టీ శ్రేణులు దహనం చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. జగన్‌ అనే చెడుపై చంద్రబాబు అనే మంచి సాధించబోయే విజయంగా ఈ దసరా పండుగ చేసుకోవాలని తెదేపా కోరింది.


ఇక ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా రాజమహేంద్రవరం క్యాంప్ సైట్ వద్ద జ‌గ‌నాసుర ద‌హ‌నం కార్యక్రమం. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నినాదాలు చేస్తూ సైకో పోవాలి అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా బ్రాహ్మణి. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టిడిపి ఇంఛార్జులు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement