Thursday, May 2, 2024

జగన్ పాలనలో స్మశానాలు హౌస్‌ ఫుల్: నిమ్మల

సీఎం జగన్ పాలనలో కోవిడ్ ఆస్పత్రులే కాదు, స్మశానవాటికల వద్ద కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. కోవిడ్ మృతులకు స్మశానవాటికలలో దహన సంస్కారాలకు నోచుకోకపోవడంతో నిమ్మల స్వయంగా స్మశాన వాటికకు చేరుకుని దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు.  ఈ సందర్భంగాల నిమ్మల జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. కోవిడ్‌తో మృతిచెందిన వారికి దహన సంస్కారాలు నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలోనే కాదు.. పొరుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ వైద్యం చేయమంటున్నారని చెప్పారు. ఆక్సిజన్ బెడ్లు లేక  ప్రజలు రోడ్డు మీదనే పిట్టల్లా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కక్షలపై దృష్టి పెట్టిన జగన్.. ఆసుపత్రి బెడ్ల మీద దృష్టి పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే నిమ్మల హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement