Friday, April 19, 2024

ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారినపడ్డారు. ఇటీవల చేయించుకున్న పరీక్షలలో ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే తనకు పాజిటివ్ వచ్చిందని… ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నానని, ఆరోగ్యంగా కూడా ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అభిమానులు ఎవరు కంగారు పడవద్దని ఇప్పుడున్న కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండాలని అంతే కాకుండా తన ఇటీవలకాలంలో కలిసిన వారంతా కూడా కరోనా టెస్టులు చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement