Tuesday, May 21, 2024

AP | టీడీపీ మినీ మేనిఫెస్టో.. ‘పూర్ టు రిచ్’ను ఆవిష్కరించిన చంద్రబాబు

దివంగత ఎన్టీఆర్ స్వగ్రామం అయిన నిమ్మకూరులో ఇవ్వాల (గురువారం) చంద్రబాబు దంపతులు పర్యటించారు. గ్రామంలోని ఎన్టీఆర్, బసవతాకరం విగ్రహాలకు వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ‘‘పూర్ టు రిచ్’’ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించారు. సంపదను సృష్టించి దానిని పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ‘పూర్ టు రిచ్’ ముఖ్య ఉద్దేశ్యమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

పేదరిక నిర్మూలన లక్ష్యంతో టీడీపీ తన మినీ మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్‌ను ప్రారంభించింది. ఈ పథకం పైలట్ ప్రాజెక్టు కింద ఎన్టీఆర్ గ్రామమైన నిమ్మకూరు, తన గ్రామమైన నారావారిపల్లె గ్రామాల్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పూర్ టు రిచ్ కార్యక్రమాన్ని నిమ్మకూరులో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

ఇక నిమ్మకూరులో 1800 ఎకరాల భూమి ఉండగా కేవలం 80 మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారన్నారు. గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారు ఇక్కడి కుటుంబాలను బాగు చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని… ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అన్వేషించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement