Tuesday, April 30, 2024

Tdp leagal – 23న రక్తదాన శిబిరం – గోడ పత్రిక ఆవిష్కరణ

ఈ నెల 23వ తేదిన టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గోడపత్రికలను ఆవిష్కరించిన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినతి

టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదిన అమరావతి హైకోర్టు దగ్గర ద్వితీయ వార్షిక రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించే ఈ రక్తధాన శిబిరానికి సంబంధించిన గోడ పత్రికలను టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు, లీగల్ సెల్ సభ్యులతో కలిసి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోసాని వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

సామాజిక బాధ్యతగా న్యాయవాదులు ఎన్టీఆర్ ట్రస్ట్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, న్యాయవాదులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు. గోడ పత్రికను ఆవిష్కరించిన వారిలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement