Wednesday, May 1, 2024

ఏపీ సీఎస్ కు వ‌ర్ల రామ‌య్య లేఖ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్‌కు టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య లేఖ రాశారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ద‌ర్యాప్తును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆయ‌న విన్న‌వించారు. కేంద్ర హోం శాఖ ఆదేశాల ప్ర‌కారం ఈ కేసులో విచార‌ణ నిష్ప‌క్ష‌పాతంగా జ‌ర‌గాల‌ని చెప్పారు. విచార‌ణ ఎదుర్కొంటున్న సునీల్ సీఐడీ చీఫ్‌గా ఉంటే విచార‌ణ అధికారిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయ‌న తెలిపారు. దీనిపై ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌, కేంద్ర‌హోం శాఖ‌తో పాటు ఏపీ డీజీపీకి కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు చెప్పారు. కాగా, సునీల్ కుమార్‌ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై విచార‌ణ జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement