Thursday, April 25, 2024

వైయస్ ను పట్టుకుని రాక్షసుడని అంటారా?: టీ.మంత్రులపై జేసీ ఫైర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ నేతల తీరును ఆయన తప్పుబట్టారు. వైయస్ తనకు ఆప్తుడని, ఇష్టమైన నాయకుడని జేసీ అన్నారు. వైయస్సార్ ను ఉద్దేశించి రాక్షసుడని, తెలంగాణకు ద్రోహం చేసినవాడని ఆ రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. వైయస్ లాంటి ఒక పెద్ద మనిషిని పట్టుకుని రాక్షసుడని ఎలా అంటారని మండిపడ్డారు. వైయస్ ను పక్క రాష్ట్ర నేతలు బండ బూతులు తిడుతుంటే రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారని జేపీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. విపక్షాలపై బూతులతో విరుచుచుపడే ఏపీ మంత్రులు ఇప్పుడు చేతులకు గాజులు తొడుక్కున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో సెటిలర్లు ఎవరూ లేరని… తమ పిల్లలు అక్కడే పుట్టి, అక్కడే చదువుకున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: నవ సూచనలు పేరుతో జగన్‌కు రఘురామ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement