Thursday, May 2, 2024

ఏపీ డిప్యూటీ సీఎం అవినీతి చిట్టా విప్పుతాః టీడీపీ నేత సంచలన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అవినీతి చిట్టా త్వరలో విప్పుతానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎన్బీసుధాకర్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. చుట్టూ ఉన్న అవినీతి పరులను కట్టడి చేయమని సలహా ఇస్తే తనపైనే తప్పుడు ఆరోపణలు చేయిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. గేటు పుత్తూరు వ్యవహారాలు, పుత్తూరులో లాండ్రీ కథలు, శ్రీసిటీ అవినీతి, తిరుమల వీఐపీ దర్శనాల బాగోతం లాంటివి అన్నీ బయట పెడతానన్నారు. పెనుమూరు బస్టాండుకు ఆనుకుని ఉన్న తమ స్థలం దేవుడి మాన్యం అని చెప్పడం మూర్ఖత్వం పేర్కొన్నారు. పసలేని ఆరోపణలు మానేసి ప్రమాణాలకు సిద్ధమా ? అని సుధాకర్ రెడ్డి సవాల్ విసిరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ స్వామి గెలవరని.. గంగాధర నెల్లూరులో టీడీపీని తాను గెలిపిస్తానని చెప్పారు.

ఇది కూడా చదవండిః జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కనబెట్టాలి: లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement