Wednesday, May 8, 2024

సీజేఐ ఎన్వీ రమణను కలిసిన మాజీ మంత్రి పల్లె

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిశారు. పుట్టపర్తి సత్యసాయి బాబా జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన సీజేఐ దంపతులను పల్లె రఘునాథ్ రెడ్డి అభినందించారు. సత్య సాయి బాబా చిత్రపటం ఇచ్చి, శాలువా బోకేతో సన్మానించారు. ప్రధాన న్యాయమూర్తి, రఘునాధ రెడ్డి క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు  జిల్లాలో వర్షాలు, సాగు చేసిన పంటలు రైతుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారిగా రమణ పుట్టపర్తికి రావడంతో జిల్లాకు సంబంధించిన పలువురు ఆయన్ను కలిసి అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement