Tuesday, April 30, 2024

సరిహద్దుల్లో అంబులెన్స్‌ల గొడవ.. సీఎంలు ఒక్కసారి చర్చించండి

సరిహద్దుల్లో ఏపీకి చెందిన అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి మండిపడ్డారు. మళ్ళీ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల గొడవ పునరావృతం అవ్వడం బాధాకరం అని అన్నారు. అంబులెన్స్‌లు కదలక ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఒక పక్కన కోర్టులు చెబుతున్న ప్రభుత్వాలు సహకారం లేకపోవడం దౌర్భాగ్యం అని వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీని పై మాట్లాడాలని, తగు నిర్ణయం తీసుకుని ప్రజలకి ఇబ్బందులు కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్, కేసీఆర్ ఒక్కసారి దీనిపై చర్చించాలని కోరారు. ఈ మేరకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. 

ఇది కూడా చదవండి: అందరిలో స్ఫూర్తి నింపిన యువతి.. ఇక లేదు!

Advertisement

తాజా వార్తలు

Advertisement