Monday, April 29, 2024

AP: నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌ నేడు ఢిల్లీలో జరగనుంది. ఈ వేడుకకు చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా వెళ్లనున్నారు.

హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లి.. రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement