Sunday, April 28, 2024

మారణహోమం సృష్టించేందుకే ఒక్క ఛాన్స్ అడిగారా?: జగన్‌పై అచ్చెన్న ఫైర్

వైసీపీ పాలనలో అరాచకానికి, అకృత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ మారిందని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో రోజుకో హత్య, గంటకో విధ్వంసం నిత్యకృత్యమైపోయాయని తెలిపారు. రాష్ట్రాన్ని జగన్ నిత్యం రావణ కాష్ఠంలా రగిలిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. అభివృద్ధికి మారుపేరుగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి కత్తుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని చంపేందుకు తెగిస్తున్నారని ధ్వజమెత్తారు.

చిత్తూరు జిల్లా రామసముద్రంలో టీడీపీ కార్యకర్త మునెప్పపై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేయడంపై ఆయన మండిపడ్డారు. మునెప్ప భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని, అడ్డుకునే ప్రయత్నం చేస్తే కత్తులతో దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసుల నిర్లక్ష్య వైఖరితో ప్రజలు స్వేచ్ఛగా బతకలేకపోతున్నారన్నారు. పేదల ఆస్తులను ఆక్రమించేందుకు, మారణ హోమం సృష్టించేందుకే ప్రజలను ఒక్క అవకాశం అడిగారా? అని జగన్ ను ప్రశ్నించారు.

ఇదీ చదవండి: ఆనందయ్యకు సెల్యూట్: మద్రాస్ హైకోర్టు

Advertisement

తాజా వార్తలు

Advertisement