Friday, May 17, 2024

టీడీపీ-జనసేనలతో పొత్తు కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది – ఎపి బిజెపి

అమరావతి – ఇప్పటి వరకు జనసేన-బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుండగా.. పవన్‌ కల్యాణ్‌ ప్రకటన తర్వాత.. టీడీపీ-జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. కీలక ప్రకటన చేసింది ఏపీ బీజేపీ. ఇప్పటి వరకు జనసేన-బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుండగా.. పవన్‌ కల్యాణ్‌ ప్రకటన తర్వాత.. టీడీపీ-జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. కీలక ప్రకటన చేసింది ఏపీ బీజేపీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని.. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని గతంలోనే పవన్ కల్యాణ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..

కానీ, పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేసింది.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందని పేర్కొంది ఏపీ బీజేపీ.. పొత్తులను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిర్ణయిస్తారని క్లారిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ సమితి

Advertisement

తాజా వార్తలు

Advertisement