Thursday, April 25, 2024

టంగుటూరి సాహ‌సం భావిత‌రాల‌కు ఆద‌ర్శం : సీఎం జగన్

స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. ఈ విష‌యాన్ని కూ యాప్ లో జ‌గ‌న్ పోస్ట్ చేశారు.
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం అని సీఎం జ‌గ‌న్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement