Thursday, May 2, 2024

జీఎస్టీ తగ్గించి చేనేతను ఆదుకోండి – నిర్మ‌లాకు వైసీపీ ఎంపీల విజ్ఞ‌ప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించవలసినదిగా వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో వంగ గీతా విశ్వనాథ్, గోరంట్ల మాధవ్, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆమెకు వివరించి సహకారమందించవలసినదిగా కోరారు. దీంతో పాటు వస్త్రాలపై జీఎస్టీ తగ్గించి… చేనేత పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా వైసీపీ ఎంపీలు నిర్మలా సీతారామన్‌ను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement