Sunday, April 28, 2024

Suicide – ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య

ముదిగుబ్బ – శ్రీ సత్యసాయి జిల్లాలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. గొర్రెల కాపరులు చేపలు పడుతున్న వ్యక్తి, ఇద్దరు చిన్నారులను వెలికి తీశారు. తర్వాత తల్లిని కూడా బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. తల్లి పిల్లలతో చెరువు వైపు వస్తుండగా గొర్రెల కాపరి పలకరించగా ఇద్దరు నీ కూతుర్లేనా అనగా అవును అని సమాధానం ఇచ్చిన కొంచెం దూరం వెళ్లి తల్లి గొర్రెల కాపరులు చూస్తుండగానే చిన్న పాపను మొదట చెరువులోకి విసరగా, రెండో పాప గ్రహించి పారిపోగా పారిపోతుండగా ఆ పాపను తల్లి వెంటబడి పట్టుకొని చెరువులోకి తోసి తాను దూకేసింది.

సమాచారం తెలుసుకున్న ముదిగుబ్బ సబ్ ఇన్స్పెక్టర్ హేమంత్ కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ముగ్గురిని పోస్టుమార్టం నిమిత్తం ముదిగుబ్బ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement