Sunday, May 19, 2024

రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలి: విద్యార్థుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై పలుచోట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని విద్యార్థుల డిమాండ్‌ చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేటలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటలో 3 వేల మందికి పైగా విద్యార్థులు, వైసీపీ మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.

కాగా, ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న సీఎం జగన్ హామీ మేరకు.. 26 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement