Tuesday, April 30, 2024

గూడూరు స‌మీపంలో.. వందేభార‌త్ రైలుపై రాళ్ల దాడి

ప్ర‌ధాని మోడీ ఏమంటా వందేభార‌త్ రైళ్ల‌ని ప్రారంభించారోగాని నిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జ‌రుగుతూనే ఉంది. కాగా దేశంలోనే అత్యంత వేగగామి ట్రైన్ గా పేరుగాంచిన వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుపై ఏపీలో రాళ్ల దాడి జరిగింది. గూడూరు సమీపంలో ఈ దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు వేగంగా వెళుతున్న రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రైలు బోగీ అద్దం పగిలినట్టు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ రైలు కూడా పలుమార్లు రాళ్ల దాడికి గురైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement