Tuesday, April 30, 2024

16న రాష్ట్ర సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకారం..

అమరావతి ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌ నూతన కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం జరగనున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కుమార్‌ తెలియజేశారు. అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్‌గా నియమితులైన ఆర్‌.మహబూబ్‌ బాషా, రాష్ట్ర సమాచార కమిషనర్‌గా నియమితులైన పి.శామ్యూల్‌ జొనాతన్‌లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని ఆయన తెలియ జేశారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమిషన్‌కు ముఖ్య సమాచార కమిషనర్‌గా మహబూబ్‌ బాషా, సమాచార కమిషనర్‌గా శామ్యూల్‌ జొనాతన్‌లను నియమిస్తూ గత నెల 21వతేదీన రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్‌.ల సంఖ్య 128,129ల ద్వారా ఆదేశాలు జారీ చేసిందని ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఇరువురు నూతన కమిషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారని ప్రవీణ్‌ కుమార్‌ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement