Friday, May 3, 2024

శ్రీ‌వారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం.. తొలిరోజే రెండు లక్షల టైం స్లాట్ టికెట్ల బుకింగ్

తిరుపతి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) తిరుమలలో పది రోజుల పాటు తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం కేటాయించిన 5 లక్షల టైం స్లాట్ దర్శనం టిక్కెట్లలో తొలిరోజే దాదాపు 2 లక్షల టీకెట్ల రిజర్వేషన్ పూర్తయింది. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తిరుమలేశుని సన్నిధిలో వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచాలని నిర్ణయించిన టీ టీ డీ ఆదివారం టైం స్టాట్ దర్శన టికెట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది.. తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 ప్రత్యేక కౌంటర్ల లో 4 కౌంటర్లను బయటి ప్రాంతాల నుంచి వచ్చే యాత్రకులకు కేటాయించింది.

శనివారం రాత్రులు నుంచే భక్తులు బారులు తీరడం తో కట్టుదిట్ట మైన ఏర్పాట్ల నడుమ అర్ధరాత్రి నుంచి కౌంటర్ల ను తెరిచారు. కౌంటర్ల వద్ద వేచివుండే భక్తుల కోసం అన్నప్రసాదాలు, పాలు, మంచినీళ్లు అందించే ఏర్పాట్లను టీ టీ డీ చేసింది ఆదివారం ఉదయం 9 గంటలకే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులైన 2,3 తేదీల దర్శనం టికెట్లన్నీ భక్తులు తీసుకున్నారు.. రాత్రి 7,8 తేదీలకు సంబందించిన టికెట్ల పంపిణీ కొనసాగుతోందని, తొలిరోజు దాదాపు 2 లక్షల టికెట్ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement