Friday, May 3, 2024

Srisailam: భ‌క్తులు అల‌ర్ట్… స్ప‌ర్శ‌, అభిషేకాలు ర‌ద్దు

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. డిసెంబర్‌ 31, జనవరి 1న భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేసింది.

కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల‌య‌న ఈవో పెద్దిరాజు చెప్పారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులందరికి త్వరితగతిన దర్శనాలు కల్పించడంలో భాగంగా స్వామివారి స్పర్శ దర్శనం, గర్భాలయ అభిషేకాలు కూడా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. సామూహిక అభిషేకాలు, బ్రేక్‌ టికెట్‌ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారని, భక్తులు గమనించాల్సిందిగా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement