Sunday, April 28, 2024

SKLM: మొదటి విడత ఇవిఎం రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి… జిల్లా ఎన్నికల అధికారి

శ్రీకాకుళం, ఏప్రిల్ 12: మొదటి విడత ఈవీఎం రాండమైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వెబ్ సైట్ లో పూర్తి అయిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జీలాని సమూన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈ.యమ్.ఎస్ 2.ఓ నిర్దేశిత వెబ్ సైట్ లో మొదటి విడత ఇవిఎం రాండమైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు.

ఈ ప్రక్రియలో డీఆర్ఓ ఎం.గణపతి రావు, ఈవిఎంల నోడల్ అధికారిణి జిల్లా ఉపాధికల్పనాధికారుణి సుధా, సర్వశిక్ష అభియాన్ ఎ.పి.సి జయప్రకాశ్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement