Monday, May 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో 20 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై అధికారులు సీరియస్ అయ్యారు. సమయపాలనలో నిర్లక్ష్యం వహించిన 20 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి రామలింగేశ్వర రెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం ఎనిమిది గంటలకు విద్యాశాఖ అధికారి కంచిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉపాధ్యాయుల హాజరైన గమనిస్తూ సమయపాలన పాటించని 20 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాల నుండి 9 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు సైతం పాఠశాలకు హాజరు కాకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement