Friday, May 3, 2024

సోముకు చురకలు.. పెదబాబు, చినబాబు​కు విసుర్లు.. విజయసాయి ట్వీట్లు హల్​చల్..​

ఏపీ రాజకీయం ఒకపట్టాన అంతుచిక్కదు.. ఎవరు ఎవరిని పొగుడుతారో, ఎవరు ఎవరిని తిడతారో తెలియని పరిస్థితి ఉంటుంది. నిరంతరం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. కాగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మధ్య కాలంలో సీఎం జగన్​మోహన్​రెడ్డిపైనా, వైసీపీ నేతలపైనా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. అతని పంచులకు సోషల్​ మీడియాలో అదిరిపోయే ట్రోలింగ్స్​, మీమ్స్​ షేర్​ అవుతున్నాయి. దీనికి కౌంటర్​గా ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన స్టైల్​లో ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ రిటార్ట్​ ఇస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తూ తెగ చక్కర్లు కొడుతున్నాయి..

ఏపీ బీజేపీ తీరుపై, ఆ పార్టీ అధినేత సోము వీర్రాజు మాటలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు రిటార్ట్​ ఇస్తూ.. సోమూని సారాయి వీర్రాజుగా నామకరణం చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు, యువ నేత లోకేశ్​పైనా విజయసాయి రెడ్డి వీర లెవల్​లో విరుచుకుపడుతుంటారు.

ప్రస్తుతం ట్విట్టర్​లో బీజేపీ లీడర్​ సోము వీర్రాజుకు సుర్రుమనేలా చురకలంటించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ‘‘వీర్రాజు గారు చాలా ఒత్తిడిలో ఉన్నట్టున్నారు. అది అదిష్ఠానం నుంచో.. చంద్రబాబు నుంచో తెలియటం లేదు. చంద్రబాబు మార్కు చౌకబారు విమర్శలు వీర్రాజు నోటి నుంచి రావడం ఆశ్చర్యకరం. బీజేపీని ఏళ్లపాటు తన గుప్పెట్లో పెట్టుకుని ఎదగకుండా తొక్కిపట్టాడు బాబు. మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది’’..  అని సోముపై తనదైన స్టైల్​లో సెటైర్​ వేశారు.

అంతేకాకుండా.. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోక్​శ్​కు కౌంటర్​గా మరో ట్వీట్​ సంధించారు విజయసాయిరెడ్డి.. ‘‘రంగా హంతకులకు వైజాగ్​ను కానుకగా రాసిచ్చి భూ దందాలకు, మద్యం సిండికేట్లకు లైసెన్సిచ్చిందే చంద్రబాబు.. భోగాపురం ఎయిర్​పోర్టు ప్రకటనకు ముందే వేల ఎకరాల భూమలను కొనిపించింది ఎవరు? ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ఏదో జరుగుతోందంటూ బెదరగొడుతున్నారు తండ్రీ కొడుకులు”అంటూ ట్వీట్​లో గట్టిగా వాయించారు విజయసాయిరెడ్డి. ఇప్పుడీ రెండు ట్వీట్లు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ వైరల్​గా మారాయి. ఇవి చూసిన చాలామంది ఏపీ రాజకీయాలంటే ఇంతేనబ్బా అని చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement