Sunday, April 28, 2024

అందరికి కృతజ్ఞతలు.. ఎమ్మెల్సీగా సోము పదవీ కాలం పూర్తి!

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా తనకు సహకరించిన బిజెపి, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలకు, తోటి శాసన మండలి సభ్యులకు, అధికార, ప్రతిపక్ష పార్టీలకు, ప్రజా సంఘాలకు సోము వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం నిమిత్తం శాసనమండలి వేదికగా ఈ ఆరేళ్లలో పలు ముఖ్యమైన అంశాలపై తన వాణి వినిపించానని తెలిపారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు మంచి చేసిన సమయంలో అభినందించానని గుర్తు చేశారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పాలక పార్టీలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న సమయంలో పోరాటం చేశారనన్నారు. ఎమ్మెల్సీగా శాశన మండలి లోపల, బయట ఉద్యమాలు, పోరాటాలు చేశానని చెప్పారు. ప్రజాభిప్రాయం, పార్టీ అభిప్రాయం మేరకు సభలో సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. పేదప్రజల సమస్యలు, ప్రజా ఆరోగ్యం, పిల్లలకు పౌష్టికాహరం విషయంలో అంగన్వాడి కేంద్రాలలో ప్రజలకు అందాల్సిన విషయంలో ప్రభుత్వ అధికారులను ఎండగడుతూ చేసిన పోరాటాలు విజయవంతమైయ్యాయని సోము వివరించారు. ఆ విషయంలో సభ్యుడిగా సంతృప్తినిచ్చే అంశంగా భావిస్తున్నాన్నారు. కోవిడ్ విషయంలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ, మౌలిక సదుపాయాలు పెంచుకోవాలని గతంలోనే సభలో సూచించానని చెప్పారు. ఈ పోరాటంలో తనకు అన్ని విధాల సహకరించిన అన్ని పార్టీలకు, మీడియా మిత్రులకు, ఉద్యోగ సంఘాలకు అధికారులకు సోము వీర్రాజు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement