Wednesday, May 1, 2024

Breaking: నెల్లూరు, క‌డ‌ప జిల్లాల్లో స్వ‌ల్ప భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఇవ్వాల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున కంపించిన భూమితో ఇళ్లలోని సామగ్రి కిందపడటం, మంచాలు కదలడంతో ఇళ్లలోని వారంతా ఒక్క‌సారిగా బయటకు పరుగులు తీశారు.
కడప జిల్లా బద్వేలు మండలంలో భూమి కంపించిందని విద్యానగర్‌, చిన్నకేశంపల్లి గ్రామస్తులు తెలిపారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఐదు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికుల ద్వారా తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement