Sunday, April 28, 2024

skill case : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కే సులో బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది..జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం ముందు ఈ విచారణ జరుగుతుంది.. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని గత వాదనల సందర్బంగా కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు. అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు జస్టిస్‌ బేలాఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనంకు తెలిపారు న్యాయవాదులు. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే.. దీంతో.. తదుపరి విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది..

చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి.. దానిలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు చెపుతోందని, తాము అధికారంలోకి వస్తే.. అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ. ఈ పిటిషన్‌ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్‌ బేలా త్రివేది ప్రశ్నించారు. బెయిల్‌ రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్ రోహత్గి చెప్పారు.. స్కిల్‌ కేసులో బెయిల్‌ మంజూరు తర్వాత.. చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారని ముకుల్‌ రోహత్గి వాదించారు. వెంటనే బెయిల్‌ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని, వెంటనే విచారణ చేపట్టాలని ముకుల్‌ రోహత్గి కోరారు.

అయితే, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు అంటున్నారు. దీంతో, రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం. ఇక, మూడు వారాల తరువాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించిన ధర్మాసనం. మరోవైపు.. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరపనుంది . జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement