Thursday, April 25, 2024

Breaking: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు

దేశంలో ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 213 కేసులు నమోదు కాగా.. తాజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. కెన్యా నుంచి చెన్నైకి వచ్చి అనంతరం తిరుపతికి వెళ్లిన 39 ఏళ్ల మహిళకు డిసెంబర్ 12న కోవిడ్ పాజిటివ్ అని తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన ఆమె శాంపిల్‌లో ఈరోజు ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. అయితే, ఆమె కుటుంబ సభ్యులు నెగెటివ్‌ వచ్చింది.

కాగా, ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు శ్రీకాకుళం జిల్లాలో నమోదైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement