Saturday, April 27, 2024

Tirumala : ప‌లు ఆర్జిత సేవ‌ల టిక్కెట్ల షెడ్యూల్ విడుద‌ల…సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలు

తిరుమల ప్రతినిధి, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్‌ లై న్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు మరియు శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి . శ్రీవారి ఆర్జిత సేవా కొరకు టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవ‌డం కోసం షెడ్యూల్ విడుదల చేసింది..ఈ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ టిక్కెట్ల‌ను పొంద‌వ‌చ్చు.

- Advertisement -

ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను కూడా అధికారులు విడుదల చేస్తారు. శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయ‌నున్నారు.
ఇక అంగప్రదక్షిణం టోకెన్లు మార్చి 23న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. భక్తులకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచారు అధికారులు. అలాగే తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
నేరుగా శ్రీవారి ద‌ర్శ‌న భాగ్యం
తిరుమలలో నేడు భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వీక్ డేస్‌, అలాగే పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో భక్తులు తిరుమలకి రావడం గణనీయంగా తగ్గారు. భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు టీటీడీ అధికారులు కాగా. సోమవారం నాడు శ్రీవారిని 65,051 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే 23,107 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.
సాల‌క‌ట్ల తెప్పోత్స‌వాలు – రేప‌టి నుంచి ప్రారంభం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధ‌వారం (ఈనెల 20వ తేదీ) నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. రాత్రి 7 గంట‌ల‌ నుంచి 8 వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు బుధవారం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడుచుట్లు తిరిగి.. భక్తులకు కనువిందు చేస్తారు. ఇక.. రెండో రోజు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరిస్తారు. మూడో రోజు శ్రీభూసమేతంగా మలయప్పస్వామివారు పుష్కరిణిని చుట్టి, భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా నాలుగో రోజు శ్రీమలయప్పస్వామి ఐదుసార్లు, చివరిరోజు 24న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. ఈ తెప్పోత్సవాల సంద‌ర్భంగా ఈనెల 20, 21వ తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, 22, 23, 24 వ తేదీల్లో అర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement