Sunday, April 28, 2024

TS: భీంగల్ బస్ డిపోను అభివృద్ధి చేయండి.. మంత్రి పొన్నంను కోరిన మానాల

నిజామాబాద్, మార్చి 19(ప్రభ న్యూస్): భీంగల్ బస్ డిపోలో పూర్తి స్థాయి అధికారులను నియమించి డిపో అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కోరారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మంగళవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ… 1989 కాంగ్రెస్ ప్రభు త్వంలో బాల్కొండ నియోజక వర్గం భీంగల్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి భీంగల్ బస్ డిపోను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించి కొన్ని సంవత్సరాల నుండి మూసివేయడం జరిగిందన్నారు. ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆలోచనతోటి సుమారు నాలుగు నెలల క్రితం బస్ డిపోను పునఃప్రారంభించి ప్రజలను మభ్యపెట్టిందని.. కానీ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బస్సులను, సిబ్బందిని గాని నియమించలేదన్నారు.

పునః ప్రారంభమైన భీంగల్ బస్ డిపోను పూర్తిస్థాయిలో సిబ్బందిని, బస్సులను ఏర్పాటు చేసి భీంగల్ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే విధంగా ప్రయత్నించి సకల సౌకర్యలు ఏర్పాటు చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు వేణు రాజ్, బాల్కొండ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర, మహేష్,నిఖిల్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement