Monday, April 29, 2024

శ్రీవారిని దర్శించిన విశాఖ శారదా పీఠాధిపతులు

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు తిరుమలలో శ్రీవారిని దర్శించారు. అంజనాద్రి అభివృద్ధి పనులకు టీటీడీ నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీఠాధిపతులు తిరుమల వెళ్లారు. ఈ సందర్బంగా వేంకటేశ్వరస్వామిని దర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం ఆనందాన్నిచ్చిందన్నారు రెండు తెలుగు రాష్ర్టాలకు వేంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. మే, జూన్ నెలల్లో ధార్మిక సదస్సు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచించినట్లు తెలిపారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు నిర్వహించలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement