Sunday, May 5, 2024

ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు: సజ్జల

కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగ‌జారింద‌ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే, ఆ ప‌రిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు సీఎం జగన్ ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని చెప్పారు. ఈ రోజు ఆయ‌నతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..   సీఎం జ‌గ‌న్ చొరవతో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ఏపీ సుభిక్షంగా ఉండాల‌ని, అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు పరిష్కారం కావాలని శ్రీవారిని కోరుకున్నాన‌ని ఆయ‌న చెప్పారు. ఆంధ్రప్ర‌దేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగుంటే రెండున్నర సంవ‌త్స‌రాల్లో అభివృద్ధి విషయంలో పరుగులు తీసేదని సజ్జల అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement