Wednesday, May 1, 2024

AP: ఆర్టీసీ బస్సు బోల్తా… ప్ర‌యాణీకులు సుర‌క్షితం

ఏపీలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా ప‌డింది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకా వారి పాలెం వద్ద అదుపుతప్పి పంట పొలాలలోకి వెళ్లి ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టింది. చల్లపల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా మేకా వారి పాలెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అయితే.. ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టినప్పటికీ ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారని స్థానికులు గుర్తించారు. ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి బస్సులో వారిని బయటకు లాగి పోలీస్ వారికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. బస్సు ప్రమాదంలో చిన్న చిన్న గాయలతో బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement