Wednesday, May 8, 2024

Big Breaking | రౌడీలు, గూండాలు, డెకాయిట్లు అధికారం చెలాయిస్తున్నారు.. వారాహి యాత్రలో పవన్​

క్రిమినల్స్​గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను శాసిస్తున్నారని, అట్లాంటి వారిని ఏరిపారేయాలన్నారు జనసేనాని పవన్​ కల్యాణ్​. ఇవ్వాల (ఆదివారం) రాత్రి వారాహి యాత్రలో భాగంగా ఆయన కాకినాడలోని సర్పవరం జంక్షన వద్ద ప్రసంగించారు పవన్​. కోన్​కిస్కాగాళ్లను తను కేర్​ చేయనని, అధికారం ఉందన్న అహంకారంతో లోకల్​ ఎమ్మెల్యే ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఒకతను తన కారు డ్రైవర్​ని మర్డర్​ చేసి, బాధిత కుటుంబానికి పార్సల్​ చేశాడని, మరో ఎమ్మెల్యే భూ కబ్జాలు, ల్యాండ్​ సెటిల్​మెంట్లతో పాటు డెకాయిట్​ గా మారరని ఆరోపించారు. రౌడీయిజం, దోపిడీ వంటి క్రిమినల్స్​కి తాను ఎదురుతిరుగుతానన్నారు. తనకు జనవాణిలో ఎమ్మెల్యే ద్వారంపూడిపై పలు ఆరోపణలు వచ్చాయన్నారు. తాను ఆంధ్రాలోనే ఉంటా.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు. తనను తిడితే కోపం రాదని తన కార్యకర్తలను ఒక్క మాట అన్నా తట్టుకోలేనన్నారు పవన్​.. కాకినాడ ఎమ్మెల్యేకు మహా తిమ్మిరి ఉందని, అహంకారం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement