Saturday, April 27, 2024

AP: వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే…ఆస్తుల కోసం ష‌ర్మిల రోడ్డుమీద‌కొచ్చింది…. మంత్రి రోజా

వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే… వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని మంత్రి రోజా నిప్పులు చెరిగారు. తిరుపతిలో ఇవాళ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. వైఎస్ షర్మిలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబుకు మేలు చేయడానికి వైఎస్ పేరు షర్మిల వాడుకుంటోందని ఆగ్రహించారు.చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని ఎద్దెవా చేశారు.

వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని వైసీపీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని ఆగ్రహించారు. ప్రత్యేక హోదా లేకుండా ఏపీని విభజించిన కాంగ్రెసులో, వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినా పార్టీలో షర్మిల చేరి జగన్ పైన, నాపై విషం చిమ్ముతోందని ఆగ్రహించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరి వైఎస్ఆర్ ఆత్మక్షోభించే విధంగా చేసిందని చురకలు అంటించారు. వైఎస్ ఆర్ కుఆయన ఆశయాలకు నిజమైన వారసుడు జగన్ మాత్రమేనన్నారు మంత్రి రోజా.

Advertisement

తాజా వార్తలు

Advertisement