Friday, April 26, 2024

జ్యూవెలరీ షాపులో భారీ చోరీ

కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు షరఫ్ బజార్‌లోని శ్రీలక్ష్మీ నరసింహ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున సమయంలో దుండగుడు దుకాణం వెనుక గోడకు రద్రం పెట్టి లోనికి ప్రవేశించాడు. షాపులో ఉన్న రూ.12 లక్షల నగదు, 45 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించాడు. చోరీ సమయంలో షాపులో ఉన్న సీసీ కెమెరాను..  పక్కకు తిప్పేశాడు. అనంతరం చోరీకి పాల్పడ్డాడు షాప్ యజమాని రఘు ఈ చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement