Sunday, April 28, 2024

Vizag : రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి.. మరో 10 మందికి గాయాలు

విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో టాటా ఏస్ వ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడక్కడే ముగ్గురు చనిపోగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతులను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన వారు హనుమంతు ఆనందరావు (45).. హనుమంతు శేఖర్ రావు (15).. చింతాడి ఇందు (65). పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరు ఘాట్‌రోడ్డులో ఓ బొలేరో వాహనం లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో బుధవారం రాత్రి సమయంలో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, వీరంతా ఒడిశాకి చెందిన వలస కూలీలుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement