Sunday, April 28, 2024

వైద్య ఆరోగ్యశాఖ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇవాళ‌ వైద్యారోగ్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సర్కార్ ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నాడు – నేడు పనులు, కొత్తగా ఏర్పాటు చేయబోతున్న మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై స‌మీక్ష‌లో చ‌ర్చించ‌నున్నారు. క్యాంప్‌ కార్యాలయంలో నిర్వ‌హించే సమీక్షకు మంత్రి ఆళ్లనాని, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అయితే రాష్ట్రంలో నిన్న ఒమిక్రాన్ కేసు నమోదైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement