Thursday, May 2, 2024

Vijayawada | ప్రాణంతీసిన పగ.. మాట్లాడుదామని పిలిచి కత్తితో నరికేశాడు

ఏపీలోని విజయవాడ శివారులో ఇవ్వాల (శనివారం) సాయంత్రం నడిరోడ్డుపై ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జక్కంపూడికి చెందిన నాగమణి రెండో కూతురుతో అల్లుడికి విబేధాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కోర్టులో కేసు పెండింగులో ఉంది.

ఈ నేపథ్యంలో అత్తమామలపై కక్ష పెంచుకున్న అల్లుడు రాజేశ్ పథకం ప్రకారం వారితో మాట్లాడాలని ఫ్లైఓవర్ ప్రాంతానికి పిలిచాడు. వారు అక్కడకు రాగానే బైక్ పై ఉన్న మామను నరికేందుకు ప్రయత్నించగా ఆయన పారిపోయాడు. అనంతరం రాజేశ్ అత్తపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన నాగమణి మృతి చెందింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement