Friday, May 17, 2024

Results – ఎపి పాలిసెట్ ఫలితాలు విడుద‌ల – 86.35 శాతం ఉత్తీర్ణ‌త‌…

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌-2023 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 10న నిర్వహించిన ఈ ప్రవేశపరీక్షలో 86.35 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలలో బాలికలే 89.90 శాతం ఉత్తీర్ణతతో ముందంజలో ఉన్నారు. 84.74 శాతం మంది బాలురు ఉత్తీర్ణ‌త సాధించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.inలో ఫలితాలు చూసుకోవచ్చు.


ఈ ఏడాది పాలిసెట్‌ కోసం 1,60,329 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో 1,24,021 మంది అర్హత సాధించారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేండ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement