Sunday, May 19, 2024

AP | మంత్రి వర్గం నుంచి గుమ్మునూరు జయరామ్ తొల‌గింపు..

మంగళగిరిలో నేడు జరిగిన జయహో బీసీ సభలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు మంత్రి గుమ్మనూరు జయరామ్. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. వైసీపీకీ, మంత్రి పదవికీ రాజీనామా చేస్తున్నట్లు మధ్యాహ్నం ప్రకటించిన గుమ్మనూరు జయరాం.. సాయంత్రం టీడీపీలో చేరిపోవడంతో వెంటనే ఆయనపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్దితి ఎదురైంది. దీంతో సీఎం జగన్ ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సమాచారం పంపించారు. దీంతో సీఎం జగన్ నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తూ గవర్నర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో జయరాం మాజీ మంత్రి అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement