Monday, April 29, 2024

జైల్లో రిమాండ్‌ ఖైదీ మృతి

పీలేరు రూరల్‌, ప్రభ న్యూస్‌: పీలేరు మండలం ఎర్రగుంట్ల పల్లిగ్రామం ముడుపుల వేములవారిపల్లికి చెందిన చంద్రా నాయక్‌ కుమారుడు మూడే రాజేష్‌ నాయక్‌ స్థానిక సబ్‌ జైల్లో మృతి చెందాడు వివరాలు గత మూడునెలల క్రితం ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థినీ బంధువులు రొంపిచెర్ల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరుకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సబ్‌ జైలుకు తరలించారు. మూడు నెలలుగా శిక్ష అనుభవిస్తున్న రాజేష్‌ నాయక్‌ సబ్‌ జైల్లో గురువారం వేకువజామున అనుమానాస్పదంగా ఉరి వేసుకున్న విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది హుటాహుటిన స్థానిక ప్రభుత్వానికి తరలించారు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు రాయచోటి ఆర్డిఓ రంగస్వామి సబ్‌ జైలుకు చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ తోటి ఖైదీలతో విచారించారు మృతికి గల కారణాలు తెలుసుకొని తగు న్యాయం చేస్తామని మృతుడి కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement