Saturday, May 11, 2024

ఛ‌లో ఢిల్లీ యాత్ర – రైలులో బ‌య‌లుదేరిన రాయ‌ల‌సీమ నేత‌లు

ఉమ్మడి కర్నూలు జిల్లా (నంద్యాల) – రాయలసీమకు రావాల్సిన నీళ్ళు,నిధులు,నియామకాలలో సమాన వాటా కోసం, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, రాయలసీమ ప్రాంత అభివృద్దే ఏకైక లక్ష్యముగా రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నంద్యాల జిల్లా నాయకులు యం. వి. రమణారెడ్డి అన్నారు. దానిలో పాల్గొనేందుకు బుధవారం నంద్యాల నుండి వందలాది మంది రైతులు, యువకులు, విద్యార్థులు భారీ వర్షాలును లెక్కచేయకుండా స్వచ్చందంగా బైరెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఛలో ఢిల్లీ కి తరలివెళ్లారు.

ఈ సందర్బంగా నంద్యాల జిల్లా రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు యం. వి. రమణారెడ్డి మాట్లాడుతూ, అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటక ప్రభుత్వం కడితే కర్నూలు – కడప ( కె సి కెనాల్ ) కాలువకు చుక్క నీరు దిగువకు రాదని, ఆయకట్టు సాగుకు కాదుకదా తాగు నీటికి రాయలసీమలో కటకట ఏర్పాడుతుందన్నారు. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై తీగల వంతెన ( ఐ కానిక్ బ్రిడ్జి ) వల్ల రాయలసీమ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, బ్యారేజ్ కం బ్రిడ్జి నిర్మిస్తే సుమారు 70 TMC ల నీరు ఆగి రాయలసీమ ప్రాజెక్టులకు అందుతుందని, సాగు తాగు నీటి కష్టాలు తొలగి కరువు, వలసలు ఆగుతాయన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కాశీపురం ప్రభాకర్ రెడ్డి, గొల్ల చిన్న నారాయణ, భాస్కర్, రామిరెడ్డి, సీమ రామిరెడ్డి, ఆళ్లగడ్డ రమేష్, కరిమద్దేల ఈశ్వర్ రెడ్డి, నరసింహ యాదవ్, లక్ష్మి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement