Tuesday, May 14, 2024

Vijayasai Reddy : పురందేశ్వరికి ఓటు ఉందా?.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. కారంచేడు 145 బూత్ లో బీజేపీకి కేవలం 6 ఓట్లు మాత్రమే పడ్డాయని, అసలు అక్కడ పురందేశ్వరికి ఓటు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మీ సొంత పార్టీకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుటు ఓటు వేయలేదా? అని అడిగారు.

మీ బావ పక్షపాతివైన మీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటగింపు అయిపోయిందని విమర్శించారు. బీజేపీలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీలో… సిద్ధాంతాలను గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారని ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే… మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనే ఉండిపోయిందని బొంకుతారని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement